ఓటు హక్కు వజ్రాయుధంలాంటిది
ABN, First Publish Date - 2023-01-26T00:36:43+05:30
18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, ప్రజా స్వామ్యంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ కార్తీక్ పేర్కొన్నారు.
జాతీయ ఓటర్ల దినోత్సవంలో సబ్ కలెక్టర్ కార్తీక్
పెనుకొండ, జనవరి 25: 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, ప్రజా స్వామ్యంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ కార్తీక్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో 162, 163, 164 పోలింగ్ కేంద్రాల్లో 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని హెచఎం జ్యోతిర్లత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సబ్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ ఓటు అనేది వజ్రాయుధంలాంటిదన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ స్వర్ణలత, నగర పంచాయతీ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ, ఎన్నికల డీటీ అశ్వత్థనారాయణ పాల్గొన్నారు.
Updated Date - 2023-01-26T00:36:45+05:30 IST