బియ్యం.. ప్రియం
ABN, First Publish Date - 2023-01-18T00:33:38+05:30
బియ్యం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఏటా సీజనలో క్వింటం రూ.3000 ఉండే ధర.. ఈ ఏడాది రూ.3,600 పలుకుతోంది. ఈ ధర సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. ఖరీఫ్ సీజన ప్రారంభంలో రూ.3000 ఉన్న ధర.. రెండు నెలల వ్యవధిలో రూ.600 పెరిగింది. హెచ్చెల్సీ ఆయకట్టులో దాదాపు 22 వేల ఎకరాలలో వరి సాగైంది.
క్వింటం ధర రూ.3,600
కణేకల్లు, జనవరి 17: బియ్యం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఏటా సీజనలో క్వింటం రూ.3000 ఉండే ధర.. ఈ ఏడాది రూ.3,600 పలుకుతోంది. ఈ ధర సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. ఖరీఫ్ సీజన ప్రారంభంలో రూ.3000 ఉన్న ధర.. రెండు నెలల వ్యవధిలో రూ.600 పెరిగింది. హెచ్చెల్సీ ఆయకట్టులో దాదాపు 22 వేల ఎకరాలలో వరి సాగైంది. ఈ ఏడాది దిగుబడి గణనీయంగా పెరిగింది. ఎకరాకు 40 నుంచి 45 బస్తాల దిగుబడి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ధరలు తక్కువగా ఉంటాయని అందరూ భావించారు. సీజన ప్రారంభంలో వరి క్వింటం ధర రూ.1950 నుంచి రూ.2050 మధ్య ఉన్నింది. ఈ ధరకే రైతులు సంతోషపడ్డారు. ఆ తరువాత కర్ణాటక ప్రాంతంలోని కాటికకు చెందిన దళారులు రంగప్రవేశం చేయడంతో ధరలు మరింత పెరిగాయి. క్వింటానికి రూ.2,300 నుంచి రూ. 2,500 వరకు ఇచ్చారు. ఈ కారణంగా బియ్యం ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి.
Updated Date - 2023-01-18T00:33:42+05:30 IST