చైతన్య రథ యాత్రను విజయవంతం చేయండి
ABN, First Publish Date - 2023-06-26T00:22:29+05:30
భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్
గుంతకల్లుటౌన, జూన 25: భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ పిలుపునిచ్చారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం టీడీపీ నాయకులతో ఆయన విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర కార్యక్రమం త్వరలో గుంతకల్లు నియోజకవర్గం లో జరుగుతుందన్నారు. చంద్రబాబు ప్రకటిం చిన మినీ మేనిఫెస్టోలోని పథకాలను ప్రజల్లో కి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకు రావాల న్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించా లన్నారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పవనకుమార్ గౌడ్, కౌన్సిలర్లు కృపాకర్, షరీఫ్, తలారి మస్తానప్ప, ఆమ్ల్లెట్ మస్తాన యాదవ్, హనమంతు, కేశప్ప, ప్రతాప్ నాయుడు, శివన్న, లక్ష్మి, బీఎల్ లక్ష్మి, మాధవి, రాము తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T00:22:29+05:30 IST