ఒక్కరైనా అడిగారా?
ABN, First Publish Date - 2023-02-06T23:59:57+05:30
వేతనాలు అందక ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
వేతనాలపై వలంటీర్ ఆవేదన
యాడికి(అనంతపురం జిాల్లా)
వేతనాలు అందక ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆ జాబితాలోకి వలంటీర్లు కూడా చేరారు. ‘జనవరి నెల గౌరవ వేతనం ఎందుకు పెట్టలేదని ఒక్కరైనా అడిగారా? కలిసికట్టుగా ఉంటేనే మన సమస్యలను పరిష్కరించుకోగలం..’ అంటూ ఓ వలంటీర్ పెట్టిన మెసేజ్ దుమారం రేపుతోంది. అనంతపురం జిల్లా యాడికి గ్రామ పంచాయతీ పరిధిలో 130 మంది గ్రామ వలంటీర్లు పనిచేస్తున్నారు. 6వ తేది వచ్చినా వారికి గౌరవ వేతనం మంజూరు చేయలేదు. దీనిపై వలంటీర్ల వాట్సాప్ గ్రూప్లో ఒక వలంటీర్ స్పందించారు. సచివాలయ ఉద్యోగులకు మాత్రం ఒకటో తేదీనే జీతాలు పెట్టారని, వలంటీర్ల గౌరవ వేతనాలు ఎందుకు పెట్టలేదని ఒక్కరైనా అడిగారా అని ఆవేదన వ్యక్తం చేశాడు.
Updated Date - 2023-02-06T23:59:58+05:30 IST