వేడుకల్లో అపశృతి
ABN, First Publish Date - 2023-03-30T23:58:35+05:30
శ్రీరామ నవమి సందర్భంగా కరావులపల్లి తండా ఆలయం వద్ద గురువారం జరిగిన ఎద్దుల బండ్ల పరుగు పందెం పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
విద్యుత స్తంభాన్ని ఢీకొన్న పరుగు పందెం ఎద్దులబండి
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
గోరంట్ల, మార్చి 30: శ్రీరామ నవమి సందర్భంగా కరావులపల్లి తండా ఆలయం వద్ద గురువారం జరిగిన ఎద్దుల బండ్ల పరుగు పందెం పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఎద్దలబండి అదుపు తప్పి రోడు పక్కను ఉన్న విద్యుత స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదంలో స్తంభం విరిగి నేలకూలింది. వైర్లు చెల్లాచెదురుగా నేలపైౖ పడ్డాయి. స్తంభానికి కిందివైపు కేబుల్ వైరుపైన 11 కేవి విద్యుత వైర్లలో వి ద్యుత సరఫరా ఉన్న సమయంలో నేకొరిగినా ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనతో నిర్వాహకులు, పోలీసులు, ప్రజలు ఆందోళన కు గురయ్యారు. అలాగే మరో ఎద్దులబండి అదుపుతప్పి నీరు లే ని దిగుడు బావిలోకి దూసుకుపోయింది. ప్రమాదంలో ఇరువురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వేలాదిమంది హాజరయ్యే వేడుక ల్లో ప్రమాదాల నివారణకు భవిష్యత్తులో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Updated Date - 2023-03-30T23:58:35+05:30 IST