Home » Puttaparthy
మండలం మాగేచెరువు వీఆర్ఓ సోమశేఖర్నాయక్ తమ భూములు అమ్మి డబ్బుల విషయంలో మో సం చేశాడని గోరంట్ల మండలం కొడిగేపల్లి పంచాయతీకి చెందిన రైతులు తహసీల్దార్ కార్యాలయంలో డీటీ రెడ్డిశేఖర్కు ఫిర్యాదు చేశారు.
నెల్లూరు నగరంలో సీపీఎం నాయకుడు పెంచలయ్యను హత్యచేసిన గంజాయి బ్యాచను కఠినంగా శిక్షించాలని సీపీఎం, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. అంబేడ్కర్ సర్కిల్లో నిరసన తెలిపారు.
ఎయిడ్స్ రహిత సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి వెంకటేశ్వర్లునాయక్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.
ప్రజాసంక్షేమం, రాషా్ట్రభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. సొమవారం మండలంలోని గౌడనహళ్ళి, భక్తరహళ్ళి, జిల్లేడగుంట గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్ను ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. బస్టాండ్లో ప్రయాణికులకు అందిస్తున్న సేవల నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, మౌలిక సదుపాయాలపై సమగ్రంగా పరిశీలించారు.
సమస్యల పరిస్కారం కోసం ప్రజాగ్రీవెన్సులో ప్రజలు సమర్పించిన అర్జీలకు తక్షణ పరిస్కారం చూపాలని సంబంధిత అదికారులను ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపుకార్లాయంలో నిర్వహించిన ప్రజాగ్రీవెన్సులో ఎమ్మెల్యే, మాజీమంత్రి నియోజకవర్గ ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ప్రజాసమస్యల పరిష్కారినికి ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద ప్రజాదర్బార్ నిర్వహించారు.
అసలే ఆ గ్రామం ప్యాక్షనతో ఇబ్బందుల పాలైంది. ఇటీవలి కాలంలో ఎలాంటి తగాదాలు, సమస్యలు లేకుండా ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఇలాంటి తరుణంలో మళ్లీ గ్రామప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది రస్తా సమస్య. మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో గడచిన 50 సంవత్సరాలుగా వాడుతున్న రస్తాను వారం రోజులక్రితం గ్రామానికి చెందిన ఒక మహిళా రైతు రస్తాలేదంటూ దారికి అడ్డుగా గుంత తీయించింది.
సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న భక్తుల కోసం పుట్టపర్తి పట్టణంలోని ఫుట్పాత మీద పలు దుకాణాలు వెలిశాయి. బెంగళూరు, చెన్నై ఇతర ప్రాంతాలకు చెం దిన వ్యాపారులు తాత్కాలికంగా పుట్పాతపై దుకాణాలు ఏర్పాటుచేసు కున్నారు. శత జయంతి వేడుకల కోసం వచ్చిన భక్తులు ఫుట్పాతఫై వెలసిన దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సత్యసా యి జయంతి వేడుకల్లో ఫుట్పాత వ్యాపారులు వెలయడం ఆనవాయితీ గా వస్తోంది.
చేనేత కార్మికులకు నేతన్న నేస్తం అమలు చేయాలని ఏపీ చేనేత సంఘం జిల్లా నాయకుడు శీల నారాయణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.