Home » Puttaparthy
మండల కేంద్రంలో 25ఏళ్ల క్రితం జనాభా తక్కువ ఉన్న సమయంలో వారపుసంతను రోడ్డుపై నిర్వహించేవారు. రాను రాను పట్టణం విస్తరించింది. మేజర్ పంచాయతీలో 20వేలకుపైగా జనాభా ఉంది. నేటికీ పాతూరుకు వెళే ్లదారిలోనే వారపుసంత నిర్వహిస్తున్నట్లు వ్యాపారులు అంటున్నారు.
మడకశిర నగర పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు.
మండల కేంద్రంలో 25ఏళ్ల క్రితం జనాభా తక్కువ ఉన్న సమయంలో వారపుసంతను రోడ్డుపై నిర్వహించేవారు. రాను రాను పట్టణం విస్తరించింది. మేజర్ పంచాయతీలో 20వేలకుపైగా జనాభా ఉంది. నేటికీ పాతూరుకు వెళే ్లదారిలోనే వారపుసంత నిర్వహిస్తున్నట్లు వ్యాపారులు అంటున్నారు.
ట్టాలపై కనీస అవగాహన లేకనే ప్రజలు కష్టాలపాలు అవుతున్నారని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎస్ రాజశేఖర్ అన్నారు. శుక్రవారం కదిరి సబ్జైలును ఆయన తనిఖీ చేశారు. ఆయన వెంట సబ్ జైల్ అధికారి ఉమామహేశ్వరనాయుడు, న్యాయవాద సభ్యులు లోకేశ్వర్ రెడ్డి, దశరథనాయక్, కేవై సిరాజుద్దీన పాల్గొన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం పీజీఆర్ఎస్ హాలులో ప్రత్యేక గ్రీవెన్సను నిర్వహించారు.
పేదలకు అండగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు మంజూరైన మరుగుదొడ్లు నిర్మాణ పనులు చేపట్టే విషయంపై టీడీపీ నాయకుల మధ్య వివాదం చెలరేగింది. రూ.15లక్షలు వ్యయంతో పాఠశాలలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు వివాదం కారణంగా అర్థాంతరంగా ఆగిపోయాయి.
నియోజకవర్గంలో 21వ తేదీన నిర్వహించే పోలియో చుక్కల కార్యక్రమంలో ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా చుక్కలు వేయించాలని డిప్యూటీ డీఎంహెచఓ డాక్టర్ మంజువాణి సూచించారు.
ఎండుమిర్చి రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని యార్డ్ అధికారులకు వ్యవసాయ మార్కెట్యార్డ్ చైర్మన అశ్వత్థనారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డ్లో ఎండుమిర్చీ క్రయ విక్రయాలను పరిశీలించారు.
వైసీపీ నేత జగన, ఆపార్టీ నాయకులు కోటి సంతకాల సేకరణ పేరిట చేస్తున్నది ఒక నాటకం అని, ప్రజల్లో విద్యార్థుల్లో స్పందన కరవయ్యిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.