బాధ్యతగా పనిచేయండి
ABN, First Publish Date - 2023-07-21T00:10:19+05:30
స్థానిక మహాత్మ జ్యోతి బాపూలే గురుకుల పా ఠశాలను పెనుకొండ సబ్కలెక్టర్ కార్తీక్ గురు వారం తనిఖీచేసి సి బ్బందిపై ఆగ్రహం వ్య క్తం చేశారు.
గురుకుల సిబ్బందిపై సబ్ కలెక్టర్ ఆగ్రహం
లేపాక్షి, జూలై 20 : స్థానిక మహాత్మ జ్యోతి బాపూలే గురుకుల పా ఠశాలను పెనుకొండ సబ్కలెక్టర్ కార్తీక్ గురు వారం తనిఖీచేసి సి బ్బందిపై ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇటీవల గురుకుల పాఠశాలలో విద్యార్థులు బయట తిరగడం, రాత్రిపూట బయటకు వెళ్లిపోవడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని పత్రికల ద్వారా తెలుసుకున్న ఉన్నతాధికారులు సి బ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విచారణ చేపట్టిన సబ్ కలెక్టర్ కార్తీక్ సిబ్బందితో సమావేశం నిర్వహించి ఆయా పాఠశాల సమస్యలపై ఆరాతీశారు. పిల్లలు ఎందుకు వెళ్లిపోతున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఎందుకు ఉండటం లేదని నిలదీశారు. కొంతమంది ఔట్సోర్సింగ్ సిబ్బంది థంబ్ వేస్తూ వెళ్లి పోతుంటే ఏం చేస్తున్నారని వెంటనే వీటిపై సమాచారం ఇవ్వాలన్నారు. విధులను సక్రమంగా నిర్వ హించి పిల్లలకు అందుబాటులో ఉండాలన్నారు. జరిగిన సంఘటనలపై ఉన్నతాఽధికా రుల దృష్టికి తీసుకెళ్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
Updated Date - 2023-07-21T00:10:29+05:30 IST