కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏం సాధించారు?: YS Sharmila
ABN, First Publish Date - 2022-07-25T19:32:32+05:30
పక్క రాష్ట్ర సీఎంను ఇంటికి పిలిచి స్వీట్లు తినిపించినప్పుడు పోలవరం వల్ల ఇబ్బంది అవుతుందని కేసీఆర్ ఎందుకు అనలేదని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: పక్క రాష్ట్ర సీఎంను ఇంటికి పిలిచి స్వీట్లు తినిపించినప్పుడు పోలవరం(Polavaram) వల్ల ఇబ్బంది అవుతుందని కేసీఆర్(KCR) ఎందుకు అనలేదని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల(Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram project) కట్టిన తర్వాతే వరద ఎక్కువ వచ్చిందని... అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏం సాధించారని ప్రశ్నించారు. కాళేశ్వరం లోపాల బాధ్యత ఎవరు తీసుకుంటారని నిలదీశారు. కలర్ ఫోటోలకు, టూరిజం స్పాట్గా మాత్రమే కాళేశ్వరం పనికొచ్చిందని విమర్శించారు. కడెం ప్రాజెక్టు గేట్లు మార్చాలన్న డిమాండ్లను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టు గేట్లు పనిచేయకపోవడం వల్లే ఇంత పెద్ద వరద వచ్చిందన్నారు. 33 మంది సిబ్బంది ఉండాల్సిన కడెం ప్రాజెక్టు దగ్గర ముగ్గురే ఉన్నారని తెలిపారు. బాధితుల డిమాండ్ మేరకు కరకట్ట నిర్మించాలని డిమాండ్ చేశారు. వరదల్లో గూడు కోల్పోయినవారికి డబుల్బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వాలని షర్మిల అన్నారు.
Updated Date - 2022-07-25T19:32:32+05:30 IST