ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల కోలాహలం

ABN, First Publish Date - 2022-09-12T01:21:02+05:30

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy) సన్నిధిలో ఆదివారం భక్తుల కోలాహలం కనిపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి (Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy) సన్నిధిలో ఆదివారం భక్తుల కోలాహలం కనిపించింది. వేకువజామున సుప్రభాత దర్శనంతో స్వయంభువులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు కొండపైకి వచ్చారు. ముందుగా కొండకింద లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కొండపైకి చేరుకుని ధర్మదర్శనాలు, ప్రత్యేక దర్శనాల క్యూలైన్లలో దేవదేవుడి దర్శనాలకు తరలివెళ్లారు. స్వామివారి ధర్మదర్శనాలకు మూడు గంటలు, ప్రత్యేక దర్శనాలకు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ముసురు వర్షం కురుస్తున్నా దేవదేవుడి దర్శనాల కోసం భక్తులు అధికసంఖ్యలో క్షేత్రానికి రావడంతో పట్టణ ప్రధానవీధులు, ఆలయ ఘాట్‌రోడ్‌ ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంది. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.38,22,868 ఆదాయం సమకూరిందని, స్వామిని సుమారు 23,246 మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-09-12T01:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising