ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూటీపై వెళుతున్న మహిళను ఢీకొట్టిన లారీ.. అక్కడికక్కడే మృతి

ABN, First Publish Date - 2022-09-29T16:34:03+05:30

స్కూటీ మీద వెళుతున్న మహిళను లారీ ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మేడ్చల్ టౌన్ ప్రధాన రహదారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్ : స్కూటీ మీద వెళుతున్న మహిళను లారీ ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మేడ్చల్ టౌన్ ప్రధాన రహదారి వివేకానంద విగ్రహం (Vivekananda Statue) సెంటర్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్‌లో నివాసముంటున్న ప్రియా మోర్ (30) ఉదయాన్నే విధులకు స్కూటీపై బయలు దేరింది. డివైడర్ వద్ద రోడ్డు దాటుతుండగా.. అతివేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో ప్రియా లారీ ముందు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రాథమిక దర్యాప్తులో మృతురాలు ప్రియా మోర్, రిలయన్స్, కండ్లకోయ శాఖలో పని చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. మేడ్చల్ పోలీసులు (Medchal Police) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  


Updated Date - 2022-09-29T16:34:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising