నగదు బదిలీ డబ్బులను ఎందుకివ్వరు
ABN, First Publish Date - 2022-11-12T03:55:29+05:30
రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకం పథకం కింద తమ ఖాతాలో వేసిన నగదును ఎందుకివ్వరంటూ లబ్ధిదారులు బ్యాంక్ మేనేజర్ను నిలదీశారు.
బ్యాంక్ మేనేజర్ను నిలదీసిన గొర్రెల పథకం లబ్ధిదారులు
మర్రిగూడ, నవంబరు 11: రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకం పథకం కింద తమ ఖాతాలో వేసిన నగదును ఎందుకివ్వరంటూ లబ్ధిదారులు బ్యాంక్ మేనేజర్ను నిలదీశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలోని గొర్రెల పెంపకందారుల ఖాతాలకు ప్రభుత్వం నగదును బదిలీ చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో డబ్బులను ఫ్రీజ్ చేశారు. అయితే ఎన్నిక ఫలితం వచ్చి కోడ్ ముగిసినా ఎందుకు డబ్బులు తీసుకోనివ్వడం లేదంటూ మర్రిగూడ మండలంలోని శివన్నగూడ యూనియన్ బ్యాంక్ మేనేజర్ నర్సింహారెడ్డిని ఐదుగురు లబ్ధిదారులు శుక్రవారం నిలదీశారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకూ లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన నగదును ఇవ్వొద్దని ఎంపీడీవో ఆదేశాలు జారీ చేశారని బ్యాంక్ మేనేజర్ తెలిపారు.
Updated Date - 2022-11-12T03:55:31+05:30 IST