ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
ABN, First Publish Date - 2022-10-04T06:23:43+05:30
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
హనుమకొండ క్రైం, అక్టోబరు 3: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దొంగత నాలకు పాల్పడుతున్న వ్యక్తిని సోమవారం హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాస్జీ తెలి పిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన దాట్ల చరణ్తేజ హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండవ సం వత్సరం చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడి బైక్ దొంగతనాలకు పాల్పడుతుం డేవాడు. ఇటీవల నగరంలో రెండు ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చంగిరెర్లలో ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్నాడు. బైక్లు పోగొ ట్టుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి వద్ద ఉన్న సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా నిందితుడు చరణ్తేజగా గుర్తించారు. అతడి ఫోన్ నెంబర్ టవర్ లొకేషన్ ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు. విచారించగా దొంగిలించిన రెండు వాహ నాలను పోలీసులకు అప్పగించాడు. పట్టుకున్న వాహనాల విలువ రూ. 1.20 లక్షల ఉంటుందని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి రిమాండు కు తరలించారు. నిందితున్ని పట్టుకోవడంలో సహకరించిన సిబ్బంది శ్రీకాంత్రెడ్డి, గౌస్ పాష, రవిలను సీఐ శ్రీనివాస్జీ అభినందించారు.
Updated Date - 2022-10-04T06:23:43+05:30 IST