గడీల రాజ్యాన్ని బద్దలు కొడతాం: కె.లక్ష్మణ్
ABN, First Publish Date - 2022-07-04T10:06:27+05:30
తెలంగాణలో కేసీఆర్ స్థాపించిన గడీల రాజ్యాన్ని బద్దలు కొడతామని, కేసీఆర్ ఫాంహౌ్సలో బందీ అయిన తెలంగాణ తల్లిని రక్షిస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు.
తెలంగాణలో కేసీఆర్ స్థాపించిన గడీల రాజ్యాన్ని బద్దలు కొడతామని, కేసీఆర్ ఫాంహౌ్సలో బందీ అయిన తెలంగాణ తల్లిని రక్షిస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. పరేడ్ గ్రౌండ్ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఎంఐఎం తోడు దొంగలన్నారు టీఆర్ఎ్సను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం బీజేపీకి మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ తరహా పరిపాలన అందిస్తామని, యూపీ నుంచి బుల్డోజర్ తెలంగాణకు రాబోతున్నదని లక్ష్మణ్ అన్నారు.
Updated Date - 2022-07-04T10:06:27+05:30 IST