ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vinay Bhaskar: పాదయాత్ర పేరుతో బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు.

ABN, First Publish Date - 2022-11-28T11:35:18+05:30

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర (Padayatra) పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) పాదయాత్ర (Padayatra) పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) ఆరోపించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సంజయ్‌ది అహంకార, కుట్ర యాత్ర అని, సంజయ్‌కు దమ్ముంటే విభజన చట్టంలోని హామీలు అమలు చేయించాలని, ఆ తర్వాత యాత్రలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా మద్దతుతో ఏర్పాటైన ప్రభుత్వాలను కూల్చాలనుకుంటే ప్రజలు సహించరన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. ఈడీ (ED), ఐటీ (IT) దాడులతో సీఎం కేసీఆర్ (CM KCR) కుటుంబం సహా, మంత్రులను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ (BJP) కుట్రలను తిప్పికొడతామన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్ష వల్లే తెలంగాణ ఆవిర్భావం జరిగిందని, నవంబర్ 29న (రేపు) దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామన్నారు. మంగళవారం నుంచి డిసెంబర్ 9వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-28T11:35:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising