వరంగల్లో టీఆర్ఎస్ నిరసన దీక్ష
ABN, First Publish Date - 2022-04-04T17:50:23+05:30
జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దీక్షలో పాల్గొని ప్రసంగించారు.
వరంగల్: జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దీక్షలో పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు జరిపే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈనెల 11న ఢిల్లీలో భారీ స్థాయిలో ధర్నా నిర్వహిస్తామన్నారు. ఆ ధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Updated Date - 2022-04-04T17:50:23+05:30 IST