Warangalలో కూలిన పాతభవనం... ముగ్గురు మృతి
ABN, First Publish Date - 2022-06-11T17:16:20+05:30
నగరంలోని చార్బౌళిలోని ఓ పాత భవనంను కూల్చివేస్తున్నా క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలింది.
వరంగల్: నగరంలోని చార్బౌళిలో విషాదం చోటు చేసుకుంది. ఓ పాత భవనాన్ని కూల్చివేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా... మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతులు ప్రకాష్(32), సునీత(30), జ్యోతి (30)గా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలిని పరీశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2022-06-11T17:16:20+05:30 IST