జనగామ జిల్లా అధ్యక్షుడిపై నాయిని ఫైర్
ABN, First Publish Date - 2022-03-23T17:31:27+05:30
జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరంగల్: జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగా రాఘవరెడ్డి టీఆర్ఎస్ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో జంగా రాఘవరెడ్డి కుమ్మక్కైయ్యారన్నారు. జంగా రాఘవరెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. జనగామ జిల్లా అధ్యక్షుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హనుమకొండ జంగా రాఘవరెడ్డి అయ్యా జాగీరా అంటూ విరుచుకుపడ్డారు. ‘‘అధిష్టానం పట్టించుకోకపోతే నా నిర్ణయం నేను తీసుకుంటా’’ అంటూ నాయిని రాజేందర్ రెడ్డి తేల్చిచెప్పారు.
Updated Date - 2022-03-23T17:31:27+05:30 IST