Warangal: శివరాత్రికి ముస్తాబైన శైవక్షేత్రాలు
ABN, First Publish Date - 2022-02-28T14:04:04+05:30
మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి.
వరంగల్: మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. వేయిస్తంబాల దేవాలయంలో నేటి నుంచి మార్చి 4 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శివరాత్రికి కురవి వీరభద్రస్వామి ఆలయం ముస్తాబైంది. అలాగే పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. అటు కాళేశ్వరముక్తీశ్వర స్వామి ఆలయంలో నేటి నుంచి మార్చి 2 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అందుకు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Updated Date - 2022-02-28T14:04:04+05:30 IST