ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్ధన్నపేటలో బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం

ABN, First Publish Date - 2022-04-14T16:20:03+05:30

జిల్లాలోని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: జిల్లాలోని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్ పూలమాల వేసిన తర్వాతే బీజేపీ వాళ్ళు పూలమాలలు వేయాలని టీఆర్ఎస్ నేతలు హుకుం జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆరూరి రాకకోసం బీజేపీ నాయకులు గంటపాటు ఎదురుచూశారు.  ఎంతకూ ఎమ్మెల్యే రాకపోవడంతో పూలమాలలు వేసేందుకు  బీజేపీ సిద్ధమవగా... వద్దని టీఆర్ఎస్‌ నాయకులు వారించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2022-04-14T16:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising