Kishanreddy letter: మూడు నూతన ఎయిర్పోర్టుల ఏర్పాటుపై కేసీఆర్కు కిషన్ రెడ్డి లేఖ
ABN, First Publish Date - 2022-07-30T19:21:34+05:30
ముఖ్యమంత్రి కేసీఆర్కు కేందమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కు కేందమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) లేఖ రాశారు. రాష్ట్రంలో మూడు నూతన విమానాశ్రయాల (New Airports) ఏర్పాటుపై లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింథియా(Jyotiraditya Cynthia) రాసిన లేఖను ఈ సందర్భంగా కేంద్రమంత్రి గుర్తుచేశారు.
లేఖలో కిషన్ రెడ్డి ఏమన్నారంటే...
* వరంగల్, అదిలాబాద్, జక్రాన్ పల్లిలో విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉంది
* సింథియా లేఖ రాసినా ఇప్పటికీ అవసరం అయినా రెగ్యులేటరీ అనుమతి వంటి ప్రాథమిక అంశాల్లో పురోగతి సాధించక పోవడం విచారకరం
* వరంగల్ విమానాశ్రయానికి ఏయిర్ పోర్ట్ అథికారిటీ ఆఫ్ ఇండియాకు 748 ఎకరాల స్థలం ఉంది. ఈ విమానాశ్రయం ప్రస్తుతం ఎలాంటి కార్యకలాపాలు చేపట్టేందుకు వీలు లేకుండా ఉంది. దీనికి వెంటనే మరమ్మత్తులు చేసి ప్రైవేటు విమానాలు రాకపోకలకు అడ్డంకులు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విమానాశ్రయ అభివృద్దికి మొదటి దశలో 27.7 ఎకరాలు , రెండో దశలో 333.86 ఎకరాలు సమీకరించాల్సి ఉంటుంది.
* ఆదిలాబాద్ విమానాశ్రయానికి రాకపోకల కోసం రన్వేకు అప్రోచ్ ప్యానెల్కు వందకు పైగా అడ్డంకులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలి. ఆనుకుంట గ్రామానికి అదిలాబాద్తో కలిపే దారిని మళ్లించాలి. మొదటి దశలో 122, రెండవ దశలో 127 ఎకరాల భూమిని సమీకరించాల్సి ఉంటుంది.
Updated Date - 2022-07-30T19:21:34+05:30 IST