మరణిస్తూ.. ముగ్గురిలో శ్వాసిస్తూ!
ABN, First Publish Date - 2022-01-09T09:13:59+05:30
మరణిస్తూ.. ముగ్గురిలో శ్వాసిస్తూ!
ఐపీఎ్సకు సిద్ధమవుతున్న యువకుడి బ్రెయిన్డెడ్
ముగ్గురు రోగులకు గుండె, కాలేయం, కిడ్నీల అమరిక
వలిగొండ, హైదరాబాద్ సిటీ, జనవరి 8: ఆ యువకుడు తాను ప్రాణాలు విడుస్తూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురు రోగులకు ఊపిరినిచ్చాడు. ఆ ప్రాణదాత యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు కు చెందిన కోల మనోహర్(23). సోములు, వాణి దంపతుల ఇద్దరు సంతానంలో మనోహర్ ఒకరు. సోములు.. మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట మెట్ల మార్గం వద్ద కిరాణాషాపు నడుతున్నారు. మనోహర్ 2019లో డిగ్రీ పూర్తిచేసినప్పటి నుంచి సివిల్స్కు సన్నద్ధం అవుతున్నారు. ఈ నెల 5న స్నేహితుడు భరత్తో కలిసి బైక్ మీద వలిగొండ వెళ్లాడు. ఇంటికి తిరిగొస్తున్న క్రమంలో వెల్వర్తి వద్ద బైక్ను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రగాయాలైన మనోహర్ను సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్డెడ్ అయిందని గుర్తించిన వైద్యులు అవయవదానం గురించి తల్లిదండ్రులను సంప్రదించగా అంగీకరించారు. శుక్రవారం రాత్రి నుంచి మనోహర్ గుండె, కిడ్నీలు, కాలేయం ఇతర అవయవాలను శస్త్రచికిత్స ద్వారా వేరుచేసి ముగ్గురికి అమర్చారు. గుండెను శనివారం ప్రత్యేక విమానంలో చెన్నై ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2022-01-09T09:13:59+05:30 IST