అక్టోబరు 17న ఆర్ఎంసీ సమావేశం
ABN, First Publish Date - 2022-09-23T08:44:45+05:30
అక్టోబరు 17న ఆర్ఎంసీ సమావేశం
శ్రీశైలం, సాగర్లలో జలవిద్యుత్, రూల్కర్వ్, వరద జలాల గుర్తింపుపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోవడానికి వీలుగా అక్టోబరు 17న రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) సమావేశం నిర్వహించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ సమావేశం ఐదుసార్లు వాయిదా పడింది. 17న జరగనున్న సమావేశానికి అయినా వీలు చూసుకొని హాజరుకావాలని, వాయిదా వేయమని మళ్లీ కోరరాదని బోర్డు విజ్ఙప్తి చేయడం గమనార్హం. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు బోర్డు ఎస్ఈ అశోక్కుమార్ గురువారం లేఖ రాశారు.
Updated Date - 2022-09-23T08:44:45+05:30 IST