మ్యూజియాలు విజ్ఞాన గనులు: కిషన్ రెడ్డి
ABN, First Publish Date - 2022-09-23T08:41:02+05:30
మ్యూజియాలు విజ్ఞాన గనులు: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): మన చరిత్ర, వారసత్వ సంపద గురించి భవిష్యత్ తరాలు తెలుసుకునేందుకు మ్యూజియాలు(సంగ్రహాలయం) సరైన వేదికలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు మ్యూజియాలను సందర్శించడాన్ని పాఠ్యప్రణాళికలో భాగం చేయాలని సూచించారు. గురువారం ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ గ్యాలరీలో ఒక ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన అనంతరం కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మన పూర్వీకులు, స్వాతంత్య్ర సమరయోధులు, దేశంలోని వివిధ చారిత్రక ప్రాంతాలు, అక్కడి సంప్రదాయాలు, ప్రత్యేకతలు, మన పూర్వీకులు వినియోగించిన ఆయుధాలు, నాటి వస్త్ర సంపద, వాటిని నేయడంలో మనవారి కళాత్మక ఆలోచనలు వంటి ఎన్నో విషయాలను తెలుసుకునేందుకు మ్యూజియాలు ఉపయుక్తం అవుతాయని పేర్కొన్నారు.
Updated Date - 2022-09-23T08:41:02+05:30 IST