పదవులు ఎవరికి శాశ్వతం కాదు: పొంగులేటి
ABN, First Publish Date - 2022-04-14T01:53:08+05:30
పదవులు ఎవరికి శాశ్వతం కాదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
ఖమ్మం: పదవులు ఎవరికి శాశ్వతం కాదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎందరో పదవులు అనుభవించి కాలగర్భంలో కలిసిపోయారని గుర్తుచేశారు. ప్రజల కోసం పనిచేసినవారే శాశ్వతంగా నిలిచారన్నారు. బతికినంత కాలం అధికారం నీతో ఉండదని, పదవి ఉన్నా లేకున్నా ప్రజల ప్రేమాభిమానాలు పొందాలని చెప్పారు. ప్రజల అభిమానం పొందినప్పుడే వ్యక్తిత్వానికి గౌరవం వస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-04-14T01:53:08+05:30 IST