బడ్జెట్లో కనిపించింది పేదరికం మాత్రమే: ఎంపీ సురేష్ రెడ్డి
ABN, First Publish Date - 2022-02-01T22:39:24+05:30
కేంద్ర బడ్జెట్లో కనిపించింది ఒక్క పేదరికం మాత్రమేనని రాజ్యసభ
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో కనిపించింది ఒక్క పేదరికం మాత్రమేనని రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లులను తిరిగి మరోసారి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించారు. పంటలకు ఎంఎస్పీపై కూడా మాట్లాడలేదన్నారు. 11 కోట్ల మంది ప్రజలు ఎంఎస్పీపై ఆధారపడి ఉన్నారన్నారు. దేశంలో డబ్బు ఉన్నవారు ఇంకా డబ్బు ఉన్నవారిగా పెరిగిపోయారని, లేనివారు ఇంకా పేదవారిగానే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2022-02-01T22:39:24+05:30 IST