ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోడు భూములపై బీజేపీ గోబెల్స్ ప్రచారం: ఎమ్మెల్సీ పల్లా

ABN, First Publish Date - 2022-01-20T22:42:13+05:30

రాష్ట్రంలో పోడు పోడు భూముల సమస్యపై బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో పోడు భూముల సమస్యపై బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. పోడు భూముల చట్టాలన్నీ బీజేపీ రూపొందించినవేనని ఆయన తెలిపారు. పోడు భూములపై చట్టం చేయాల్సింది పార్లమెంట్ అని ఆయన పేర్కొన్నారు. అక్కడ చేయాల్సింది చేయకుండా ఇక్కడ పోరాటం అంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇక్కడ గొడవలు పెట్టే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోందని ఆయన ఆరోపించారు. బీజేపీవి కేవలం మాటలేనని, చేతలు కావని ఆయ ఎద్దేవా చేశారు.


రాష్ట్రంలో13 లక్షల ఎకరాలకు నాలుగన్నర లక్షల మంది పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. మీకు దమ్ముంటే పట్టాలు ఇచ్చే అనుమతి ఇవ్వగలరా అని ఆయన నిలదీశారు. పోడు భూమలకు హక్కు కావాలి అని  పార్లమెంట్‌లో బండి సంజయ్ అడగాలని ఆయన సవాల్ విసిరారు. గిరిజనులు ఇప్పుడు ఓటు బ్యాంక్ కాదన్నారు. బీజేపీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక చర్యలను గిరిజనులు దళితులు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అర్‌ఓ‌ఎఫ్ అర్ చట్టంలో మార్పులు తీసుకు రావాలని ఆయన కోరారు. బీజేపీకి దమ్ముంటే  జీఓ3ను  పునరుద్ధరించాలని ఆయన సవాల్ విసిరారు. 


Updated Date - 2022-01-20T22:42:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising