Hyderabad City: సైబరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
ABN, First Publish Date - 2022-06-21T13:30:15+05:30
కూకట్పల్లి పరిధిలోని ఖైతలాపూర్ ఆర్వోబీని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు
హైదరాబాద్ సిటీ: కూకట్పల్లి పరిధిలోని ఖైతలాపూర్ ఆర్వోబీని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు సైబరాబాద్లో ఉదయం 7 గంటల నుంచి 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని డీసీపీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఎర్రగడ్డ నుంచి వయా మూసాపేట మీదుగా హైటెక్ సిటీ వెళ్లాల్సిన వాహనదారులు మూసాపేట వై జంక్షన్ వద్ద మళ్లించుకొని కూకట్పల్లి రోడ్ నంబర్-1, కేపీహెచ్బీ జేఎన్టీయూ మీదుగా హైటెక్స్కు వెళ్లాల్సి ఉంటుంది.
బాలానగర్ - వై జంక్షన్ నుంచి హైటెక్స్కు వెళ్లే వాహనదారులు ఐడీఎల్ ట్యాంక్ వద్ద వాహనాలను మళ్లించి ఐడీఎల్ ఎంట్రెన్స్ నుంచి కూకట్పల్లి రోడ్డు నంబర్-1, కేపీహెచ్బీ, జేఎన్టీయూ మీదుగా హైటెక్స్ వెళ్లాల్సి ఉంటుంది.
హఫీజ్పేట నుంచి ఖైతలాపూర్ మీదుగా వారు ఆర్యూబీ వద్ద వాహనాలు మళ్లించి జేఎన్టీయూ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
Updated Date - 2022-06-21T13:30:15+05:30 IST