మోదీ పెద్దగా చదువుకోనందునే తప్పుడు నిర్ణయాలు:Revant reddy
ABN, First Publish Date - 2022-06-26T23:24:36+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దగా చదువుకోని కారణంగానే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revant reddy)అన్నారు.
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దగా చదువుకోని కారణంగానే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revant reddy)అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీపై విమర్శలు చేశారు.ఆర్మీ ఎలా పని చేస్తుందో బీజేపీకి అర్థం కావడం లేదని అన్నారు. అగ్నిపథ్తో(agnipath) నాలుగేళ్ల తర్వాత వారు ఏం చేయాలి?అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఇజ్రాయిల్ చిన్న దేశం,దానితో పోల్చడం కరెక్ట్ కాదని అన్నారు.అమెరికాలో ఆర్మీ నుంచి బయటకు రాగానే అవకాశాలు ఉన్నాయి. కానీ భారత్లో పరిస్థితి భిన్నమని అన్నారు. నిరుద్యోగ తీవ్రత ఎక్కువ వుందని,వెంటనే అగ్నిపథ్ను ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Updated Date - 2022-06-26T23:24:36+05:30 IST