ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి...Modiకి రేవంత్ బహిరంగ లేఖ

ABN, First Publish Date - 2022-05-26T16:36:03+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని విమర్శించారు. రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీ... తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యల పట్ల  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని  అంశాలపై రేవంత్ పలు ప్రశ్నలు సంధిస్తూ సమాధానలు చెప్పాలని లేఖలో కోరారు. కాళేశ్వరంలో అవినీతిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు హామీని నెరవేర్చుతారా? లేదా? అని నిలదీశారు.


విభజన హామీల్లో భాగంగా బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ,  ఐటీఐఆర్‌ ప్రాజెక్టులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అని టీపీసీసీ చీఫ్ అడిగారు. నైనీ కోల్‌ మైన్స్‌ టెండర్లలో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా చర్యలెందుకు తీసుకోవడం లేదన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జాప్యం ఎందుకు అని నిలదీశారు. రామాయణం సర్క్యూట్‌ ప్రాజెక్ట్‌లో భద్రాద్రి రాముడికి చోటెందుకు ఇవ్వలేదు అంటూ లేఖలో రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. 

Updated Date - 2022-05-26T16:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising