ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జవాన్‌‌లను అవమానించేలా మోదీ సర్కార్ వ్యవహారం: Revanth reddy

ABN, First Publish Date - 2022-06-27T19:42:29+05:30

శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే జవానులను అవమనించేలా మోదీ సర్కారు వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే జవానులను అవమనించేలా మోదీ సర్కారు వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) అన్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మల్గాజ్‌గిరి కూడలి వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులను, సైనికులను సమాజాన్ని నిర్మించే శక్తులుగా వారిని  కాంగ్రెస్ గుర్తించిందన్నారు. అంబాని, ఆదాని కంపెనీల రక్షణకు అగ్నిపథ్ పథకాన్ని తెచ్చారని ఆరోపించారు. నాలుగేళ్లు సైన్యంలో ఆ తరువాత జీవిత కాలం బడా పారిశ్రామిక వేత్తలకు కాపలా కాయలా? అని ప్రశ్నించారు. అగ్నిపథ్‌తో ఉద్యోగ భద్రత లేదని, మాజీ సైనికుల హోదా లేదని, ఫించన్ కూడా లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-06-27T19:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising