మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడిని జైలుకు పంపిస్తాం: రేవంత్ రెడ్డి
ABN, First Publish Date - 2022-05-24T03:26:14+05:30
మంత్రి మల్లారెడ్డిపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడిని..
హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి (Malla Reddy)పై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి (Revanth Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడిని జైలుకు పంపిస్తామని ఆయన హెచ్చరించారు. గుండ్లపోచంపల్లిలో పార్క్ను తొలగించి రోడ్లు వేశారని మండిపడ్డారు. రెవెన్యూ చట్టాన్ని అడ్డుపెట్టుకుని వందలాది ఎకరాలు మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డిని జైల్లో వేస్తామన్నారు. మల్లారెడ్డి అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్తో విచారణ జరిపిస్తామని చెప్పారు. జవహర్నగర్లో ప్రభుత్వ భూమిని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-05-24T03:26:14+05:30 IST