ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు: Kodandaram

ABN, First Publish Date - 2022-05-31T16:24:19+05:30

నీళ్లు, నిధులు, నియామకాల్లో టీఆరెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీజేఎస్ పార్టీ అధ్యక్షులు కోదందరాం విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: నీళ్లు, నిధులు, నియామకాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం(TRS government) పూర్తిగా విఫలమైందని టీజేఎస్(TJS) పార్టీ అధ్యక్షులు కోదందరాం(Kodandaram) విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం ఆంధ్ర కాంట్రాక్టర్లకే ప్రయోజనం చేకూరిందన్నారు. ప్రగతి భవన్‌లో ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎర్ర తివాచీ పరుస్తున్నారని మండిపడ్డారు. మిగతా వారు ప్రగతి భవన్‌కు వెళితే 144 సెక్షన్ ద్వారా కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.


ధర్నా చౌక్‌లు ప్రభుత్వం మూయిస్తే కోర్టు ద్వారా తెరిపించామని తెలిపారు. కాళేశ్వరం ఖర్చు ఎక్కువ... నీళ్లు తక్కువని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నియంత నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే స్వస్తి పలుకుతారని హెచ్చరించారు. జూన్ 6న ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో తెలంగాణ ఆత్మగౌరవ దీక్షకు ఉద్యమకారులు రాజకీయ పార్టీలకతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులు మరో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోదండరాం పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-31T16:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising