ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ భూములు రాష్ట్రానికి అప్పగించాలి: తమ్మినేని

ABN, First Publish Date - 2022-06-22T10:20:06+05:30

రాష్ట్రంలో గతంలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను తెగనమ్మే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గతంలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను తెగనమ్మే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. వాటిని పునరుద్దరించాలని, లేదా ఆ స్థలాల్లో కొత్త పరిశ్రమలను ప్రారంభించాలని, వీలు కాకుంటే ఆ స్థలాలను తిరిగి ఇచ్చివేయాలని కోరారు. మూసివేసిన ఐడీపీఎల్‌, హెచ్‌ఏఎల్‌, హెచ్‌ఎంటీ, హెచ్‌సీఎల్‌, డీఆర్‌డీఎల్‌, సీసీఐ లాంటి సంస్థల ఏర్పాటుకు 7,200 ఎకరాల భూమిని రాష్ట్రం కేటాయించిందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఈ సంస్థలను ఉద్దేశపూర్వకంగా మూసేసి వాటి ఆస్తులు, భూములను కారుచౌకగా అమ్ముకునేందుకు కేంద్రం సిద్ధపడుతోంందని ఆరోపించారు. ఆ ఆస్తులు రాష్ట్ర ప్రజల సంపద అని, రూ. వేల కోట్ల విలువైన ఈ భూములను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టాలని మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా ప్రతిఘటించాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.  

Updated Date - 2022-06-22T10:20:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising