Telangana news: గురుకుల పాఠశాలలో టీచర్ అమానుషం
ABN, First Publish Date - 2022-07-21T15:23:23+05:30
జిల్లాలోని దామరవంచ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి పట్ల ఉపాధ్యాయుని అమానుషంగా ప్రవర్తించాడు.
మహబూబాబాద్: జిల్లాలోని దామరవంచ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి పట్ల ఉపాధ్యాయుని అమానుషంగా ప్రవర్తించాడు. గోడ దూకి ఇంటికి పారిపోయాడని వర్షిత్ అనే విద్యార్థిని పీఈటీ వస్రం చితకబాదాడు. అంతేకాకుండా విద్యార్థిపై బూతు పురాణం అందుకున్నాడు. దామరవంచ హాస్టల్లో వర్షిత్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పీఈటీ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Updated Date - 2022-07-21T15:23:23+05:30 IST