తండ్రిని హత్య చేసిన కొడుకులు..సహకరించిన తల్లి
ABN, First Publish Date - 2022-06-26T02:07:23+05:30
జయశంకర్ భూపాలపల్లి: మద్యం తాగొచ్చి నిత్యం తల్లిని హింసిస్తుండడంతో భరించలేని కొడుకులు తండ్రిని హత్య చేశారు. భూపాలపల్లి కారల్ మార్క్ కాలనీకి చెందిన ఎల్లయ్య(55)
జయశంకర్ భూపాలపల్లి: మద్యం తాగొచ్చి నిత్యం తల్లిని హింసిస్తుండడంతో భరించలేని కొడుకులు తండ్రిని హత్య చేశారు. భూపాలపల్లి కారల్ మార్క్ కాలనీకి చెందిన ఎల్లయ్య(55) మద్యానికి బానిసయ్యాడు. భార్య భూలక్ష్మిని డబ్బుల కోసం నిత్యం వేధించేవాడు. వేధింపులు భరించలేక కొడుకులు తండ్రిని హత్య చేశారు. భూలక్ష్మి కూడా కొడుకులకు సహకరించింది. ముగ్గురు హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణలో హత్యోదంతం బయటపడింది.
Updated Date - 2022-06-26T02:07:23+05:30 IST