14 నుంచి రెండో విడత ప్రజా సంగ్రామయాత్ర
ABN, First Publish Date - 2022-04-06T21:41:37+05:30
రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ
హైదరాబాద్: రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత కార్యక్రమం ఈ నెల 14 నుంచి తిరిగి ప్రారంభం కానుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మొదటి విడతలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేశారు. అయితే ఎండలు మండి పోతుండటంతో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డాక్టర్ల సలహాతో డైట్ను సంజయ్ ప్రారంభించారు. ఉదయం, సాయంత్రం సమయాల్లోనే సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. మధ్యాహ్నం ఆయా గ్రామల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Updated Date - 2022-04-06T21:41:37+05:30 IST