ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో అధికారం బీజేపీదే

ABN, First Publish Date - 2022-06-23T08:13:10+05:30

హైదరాబాద్‌లో వచ్చే నెల 1-4 తేదీల్లో నిర్వహించే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, భారీ బహిరంగ సభను విజయవంతం చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులకు జాతీయ నాయకత్వం సూచించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రజలకు ఈ విధంగా సంకేతాలిద్దాం 
  • సమావేశాలు, సభను సక్సెస్‌ చేయండి  
  • బీజేపీ రాష్ట్ర నేతలకు అధిష్ఠానం సూచన 
  • కార్యవర్గ సమావేశాలపై నేతల సమావేశం 


న్యూఢిల్లీ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో వచ్చే నెల 1-4 తేదీల్లో నిర్వహించే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, భారీ బహిరంగ సభను విజయవంతం చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులకు జాతీయ నాయకత్వం సూచించింది. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీయే అధికారంలోకి వస్తుందన్న సంకేతాలను పంపించే దిశగా వీటిని నిర్వహించాలని కోరింది. సమావేశాల ఏర్పాట్లపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ పాటు ఇతర ముఖ్య నేతలతో బుధవారం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, సంయుక్త ప్రధాన కార్యదర్శి శివ్‌ ప్రకాశ్‌ సమీక్షించారు.


ఈ సందర్భంగా లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రత్యేకత ఉందన్నారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారని చెప్పారు. అంతేకాకుండా, తెలంగాణ రాజకీయ పరిణామాల రీత్యా రాష్ట్రంలో ఆయా వర్గాలతో సమ్మేళనాలను నిర్వహిస్తామని, హైదరాబాద్‌ మినీ భారత్‌గా ఉన్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారితో కూడా సమ్మేళనాలను నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో టీఆర్‌ఎ్‌సపై వ్యతిరేకత పెరిగిపోయి, తమవైపు చూస్తున్న ప్రజలకు ఈ సమావేశాలు భరోసా నింపుతాయన్నారు. టీఆర్‌ఎస్‌ విస్మరించిన ఉద్యమ ఆకాంక్షలు, చరిత్రను చాటిచెప్పే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, తెలంగాణ ఉద్యమం, నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుల చరిత్రపై ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలపై ప్రజలకు నమ్మకం పోయిందని, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీలు ఒక గూటి పక్షులేనని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. 


Updated Date - 2022-06-23T08:13:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising