ఆ బాధ్యత బండి సంజయ్దే: మంత్రి కొప్పుల
ABN, First Publish Date - 2022-04-07T21:35:24+05:30
రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనిపించాల్సిన బాధ్యత బీజేపీ
కరీంనగర్: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనిపించాల్సిన బాధ్యత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్దే అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఒకవేళ ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడంలో విఫలమైతే సంజయ్ తన ముక్కును నేలకు రాసి క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రంపై ఎందుకు కక్ష కట్టారని కేంద్రాన్ని ఆయన నిలదీశారు. రైతులను గోస పెడుతున్న బీజేపీ ప్రభుత్వం బాగుపడదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రైతులను అవహేళన చేసిన వాళ్లకు దీటైన జవాబు చెప్తామని ఆయన హెచ్చరించారు. పంజాబ్, హర్యానాలలో ధాన్యాన్ని ఎలా కొంటారని, తెలంగాణలో ఎందుకు కొనరని ఆయన ప్రశ్నించారు.
Updated Date - 2022-04-07T21:35:24+05:30 IST