తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారింది: కేసీఆర్
ABN, First Publish Date - 2022-02-12T22:28:35+05:30
నూతన కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ధనిక
యాదాద్రి: నూతన కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారిందని తెలిపారు. రైతుబంధుతో గ్రామాలు పచ్చబడ్డాయని, ఉద్యోగులకు సంబంధించి చిన్న చితకా సమస్యలున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ శనివారం యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ నెల 7వ తేదీన యాదాద్రి కొండపై పర్యటించి, ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్.. 12వ తేదీన మళ్లీ వస్తానని, పనులు వేగవంతం చేయాలని సూచించారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటనకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
Updated Date - 2022-02-12T22:28:35+05:30 IST