చెరువులో ఈతకెళ్లి విద్యార్థులు మృతి
ABN, First Publish Date - 2022-05-31T03:23:12+05:30
చెరువులో ఈతకెళ్లి విద్యార్థులు మృతి
ములుగు: జిల్లాలోని గోవిందరావుపేట మండలం లక్నవరంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకెళ్లి విద్యార్థులు సాయిప్రీతమ్, తరుణి మృతి చెందారు. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మృతుల కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
Updated Date - 2022-05-31T03:23:12+05:30 IST