ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంకా వీడని వ్యక్తి తల మిస్టరీ

ABN, First Publish Date - 2022-01-12T22:04:11+05:30

మెట్టు మహంకాళి దేవత పాదాల వద్ద లభించిన వ్యక్తి తల మిస్టరీ ఇంకా వీడలేదు. చింతపల్లి మండలం గొల్లపల్లి మెట్టు మహాంకాళి దేవత పాదాల వద్ద ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: మెట్టు మహంకాళి దేవత పాదాల వద్ద లభించిన వ్యక్తి తల మిస్టరీ ఇంకా వీడలేదు. చింతపల్లి మండలం గొల్లపల్లి మెట్టు మహాంకాళి దేవత పాదాల వద్ద ఈ నెల 10న ఆదివారం  ఉదయం మొండెం లేని శిరస్సు లభించింది. మూడు రోజులుగా 12 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు  కొనసాగుతున్నాయి. చింతపల్లి మండలంలో మకాం వేసి కేసు మిస్టరీని ఛాలెంజ్‌గా ఎస్పీ రేమా రాజేశ్వరి తీసుకున్నారు. ఇటీవలే ఇద్దరు స్వాములు చింతపల్లి మండలంలో పోలీసులు పూజలు చేసినట్టు గుర్తించారు. నరబలి ఇచ్చారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. మూడు రోజులుగా దేవరకొండ మార్చురీలోనే మొండెం లేని తల ఉంది. మొండెం కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హత్య చేయబడ్డ వ్యక్తి సూర్యాపేట జిల్లా శూన్య పహాడ్‌కు చెందిన మతిస్థిమితం లేని రమావత్ జయేందర్ నాయక్‌గా గుర్తించారు. తమ బిడ్డను నరబలి ఇచ్చారని తండ్రి జయేందర్ తండ్రి శంకర్ నాయక్ ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో గుప్త నిధుల కోసం, అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్యలు జరిగాయి. 

Updated Date - 2022-01-12T22:04:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising