పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-05-16T23:29:58+05:30
పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య
జగిత్యాల: జిల్లాలోని రఘురాములకోటలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో పురుగులమందు తాగి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పుల బాధతో దంపతులు మునిధర్, సులోచన ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకుల బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబీకుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2022-05-16T23:29:58+05:30 IST