సీఎం కేసీఆర్కు రేవంత్రెడ్డి లేఖ
ABN, First Publish Date - 2022-08-02T01:35:36+05:30
సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులు, బాధితులను ఆదుకోవాలన్నారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాలతో నష్టపోయిన రైతులు, బాధితులను ఆదుకోవాలన్నారు. నష్టపోయిన పంటకు ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. అలాగే పసుపు పంట ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో వరద నష్టంపై ప్రభుత్వం సర్వే చేయించి.. నివేదికను కేంద్రానికి పంపించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2022-08-02T01:35:36+05:30 IST