కొంగాల జలపాతం వద్ద విషాదం
ABN, First Publish Date - 2022-07-02T23:09:18+05:30
కొంగాల జలపాతం వద్ద విషాదం
ములుగు: జిల్లాలోని వాజేడు మండలం కొంగాల జలపాతం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. జలపాతం వద్ద రాకేష్ (21) అనే యువకుడు గల్లంతయ్యాడు. తోటి స్నేహితులతో కలిసి జలపాతంలో స్నానం చేస్తుండగా గల్లంతయ్యాడు. వరంగల్ స్తంబంపల్లికి చెందిన రాకేష్గా గుర్తించారు. హైదరాబాద్ టీసీఎస్లో రాకేష్ పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2022-07-02T23:09:18+05:30 IST