రోడ్డుప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి
ABN, First Publish Date - 2022-07-20T03:19:34+05:30
జిల్లాలోని హుజురాబాద్ కేసీ క్యాంపు దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్-లారీ ఢీకొన్న ప్రమాదంలో చిన్న పాపయ్య పల్లె గ్రామానికి చెందిన గవర్నమెంట్ ఉపాధ్యాయుడు గూడూరి రాజిరెడ్డి మృతి చెందాడు.
కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ కేసీ క్యాంపు దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బైక్-లారీ ఢీకొన్న ప్రమాదంలో చిన్న పాపయ్య పల్లె గ్రామానికి చెందిన గవర్నమెంట్ ఉపాధ్యాయుడు గూడూరి రాజిరెడ్డి మృతి చెందాడు. హుజురాబాద్ నుంచి ప్రభుత్వ హైస్కూల్లో విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2022-07-20T03:19:34+05:30 IST