నాలుక కోసి దుండగుల పరార్
ABN, First Publish Date - 2022-12-06T21:37:55+05:30
జిల్లాలోని రేగొండ మండలం కాకర్లపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది.
భూపాలపల్లి: జిల్లాలోని రేగొండ మండలం కాకర్లపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. గంధం ఓదేలు అనేవ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆయన నాలుకకోసి దుండగులు పరారైయ్యారు. మాస్కులు ధరించి ఉన్న నలుగురు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడ్డ ఓదేలు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Updated Date - 2022-12-06T21:37:56+05:30 IST