తెలంగాణ, ఏపీకి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలి: కేటీఆర్
ABN, First Publish Date - 2022-01-31T16:41:13+05:30
తెలంగాణ, ఏపీకి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాలకు నిధులు
హైదరాబాద్: తెలంగాణ, ఏపీకి ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఏడున్నరేళ్లుగా కేంద్రం నుంచి సహాయ, సహకారాలు లేవని తెలిపారు. ఈసారి బడ్జెట్లోనైనా విభజన హామీలు అమలు చేయాలని, తెలంగాణలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. దేశంలో 4 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని తెలిపారు. కేంద్రం సహకరిస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం అవసరమన్నారు. తమ హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
Updated Date - 2022-01-31T16:41:13+05:30 IST