ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణాలు తీసిన ఈత సరదా!

ABN, First Publish Date - 2022-04-04T09:50:44+05:30

ఆ ముగ్గురూ.. ఆరు, నాలుగో తరగతి విద్యార్థులు. ఆదివారం బడికి సెలవు కావడంతో.. సరదాగా చెరువులో ఈత నేర్చుకోవాలనుకున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి

ధర్మపురి, ఏప్రిల్‌ 3: ఆ ముగ్గురూ.. ఆరు, నాలుగో తరగతి విద్యార్థులు. ఆదివారం బడికి సెలవు కావడంతో.. సరదాగా చెరువులో ఈత నేర్చుకోవాలనుకున్నారు. ఇందుకుగాను సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఆ సరదానే వాళ్ల పాలిట శాపమైంది. వారి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామానికి చెందిన మారంపెల్లి శరత్‌ (14), పబ్బతి నవదీప్‌ (11), గొలుసుల యశాంత్‌ (13).. ఈ విషాధ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయమే ఈ ముగ్గురు బాలురూ గ్రామ సమీపంలోని ఊరకుంట చెరువు వద్దకు వెళ్లారు. అలా.. సరదాగా ఈత నేర్చుకునేందుకు ముగ్గురూ చెరువులో దిగారు. అనుకోకుండా లోతైన ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో.. ఆ నీటిలో మునిగిపోయారు. ఊపిరాడక.. ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు విడిచారు. చెరువు వద్ద వీరి చెప్పుల్ని గుర్తించిన గ్రామస్థులు.. గాలించగా.. ముగ్గురి మృతదేహాలూ బయటపడ్డాయి. మృతుల్లో శరత్‌.. ఆరో తరగతి చదువుతుండగా.. యశాంత్‌, నవదీప్‌ నాలుగో తరగతి చదువున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-04-04T09:50:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising