ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధ్యాత్మిక స్వర్గధామం.. యాదాద్రి: స్వరూపానందేంద్ర

ABN, First Publish Date - 2022-04-12T20:44:31+05:30

అత్యద్భుతమైన కట్టడం యాదగిరిగుట్ట, శ్రీ కృష్ణ దేవరాయలులా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను అత్యద్భుతంగా నిర్మించారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి:  అత్యద్భుతమైన కట్టడం యాదగిరిగుట్ట, శ్రీ కృష్ణ దేవరాయలులా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను అత్యద్భుతంగా నిర్మించారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వ్యాఖ్యానించారు. మంగళవారం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామీ  దర్శించుకున్నారు.గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధానాలయ నిర్మాణాలను పరిశీలింశారు.  ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మీడియాతో మాట్లాడుతూ..  ‘‘యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది.కరోనా కారణంగా విశాఖ, ఋషికేశ్‌లోనే గడపడం జరిగింది.దేశంలో ఎంతో మంది హిందువులం అంటారు.. కానీ ఎవరూ చేయని నిర్మాణం సీఎం కేసీఆర్ చేశారు.ఇది ఒక అద్భుతం, ప్రజలకు  భక్తులకు ఆధ్యాత్మిక స్వర్గధామం. ఇంకా కొన్ని సదుపాయాలు కల్పించాలి, హిందూ దేవాలయాలు ఎవరి సొత్తు కాదు, ప్రజలందరివీ. యుగయుగాలుగా శైవులు, వైష్ణవులు వైషమ్యాలతో  కొట్టుకున్నారు. ఆది శంకరాచార్యుల వారు అందరినీ సమానంగా చూశారు, అందరు దేవతల నిలయం యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట టీటీడీ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా’’ అని స్వరూపానందేంద్ర తెలిపారు.

Updated Date - 2022-04-12T20:44:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising