ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News:సంగారెడ్డి జిల్లాలో జోగిని అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2022-07-22T23:49:45+05:30

జిల్లాలో జోగిని(jogini) అనుమానాస్పద మృతి(suspicious death) సంచలనం రేపుతోంది. జిల్లాలోని మారేడ్‌పల్లిలో జరిగిన బోనాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి: జిల్లాలో జోగిని(jogini) అనుమానాస్పద మృతి(suspicious death) సంచలనం రేపుతోంది. జిల్లాలోని మారేడ్‌పల్లిలో జరిగిన బోనాల జాతర( Bonala Jatara)కు జోగినిలు వెళ్లారు వీరితో పాటు జోగిని దీపికా(Deepika) వెళ్లింది. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న దీపికా అనుమానాస్పదంగా మృతిచెందింది. అయితే ఈ మృతిపై జోగినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీపికా మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని మారేడ్‌పల్లి నుంచి గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital) మార్చురీకి అంబర్‌పేట్ పోలీసులు(Amberpet Police) తరలించారు. గాంధీ ఆస్పత్రి వద్ద జోగినిలు నిరసన తెలిపారు. దీపికాను సాయిహర్ష అనే వ్యక్తి హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హంతకుడిని తప్పించడానికి పోలీసులు, లింగంపల్లి (Lingampally)లోని ఓ హాస్పిటల్ వైద్యులు ప్రయత్నిస్తున్నారని జోగినిలు ఆరోపించారు. ఒక ప్రణాళిక ప్రకారమే జోగిని దీపికాను సాయిహర్ష హత్య చేశారని అంటున్నారు. దీపికా మృతదేహాన్ని నాగోల్‌( Nagol) లోని సాయిహర్ష ఇంటివద్దకు తీసుకు వెళ్లి ధర్నా చేస్తామని జోగినిలు తెలిపారు. 

Updated Date - 2022-07-22T23:49:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising